ఆంధ్ర ప్రదేశ్ కి పూర్వ వైభవం తీసుకొస్తాం: చంద్రబాబు నాయుడు

-

గత ఐదేళ్లు ఏపీలో సాగించిన అరాచక పాలనతో వైసిపి మూల్యం చెల్లించుకుంది. ఎన్నికల ఫలితాల్లో ఆ పార్టీ కనీవిని ఎరగని రీతిలో ఓటమి పాలయింది.వైఎస్ జగన్‌ నియంతృత్వ పాలనకు రాష్ట్ర ప్రజలు చరమగీతం పాడుతూ.. తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని కూటమికి పట్టం కట్టారు.కూటమి దెబ్బకు వైసిపి పార్టీ అడ్రస్ లేకుండా పోయింది.

ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు కి దేశ నలుమూలల నుండి ప్రశంసలు, శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి. తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడుని ఉద్దేశించి ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. ఇక ఏపీలో ఎన్డీఏ అధికారంలోకి రావడంపై ప్రధాని మోదీ చేసిన ట్వీట్కు చంద్రబాబు రిప్లై ఇచ్చారు. ‘మోదీ గారికి ధన్యవాదాలు. లోక్సభ, ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ విజయం సాధించినందుకు ప్రజల తరఫున నేను మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. కూటమిపై వారికున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తాం అని అన్నారు. మన ప్రజలతో కలిసి ఆంధ్రప్రదేశ్ను పునర్నిర్మించి, పూర్వ వైభవం తీసుకొస్తాం’ అని ఎక్స్(ట్విట్టర్) లో పోస్ట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news