కీరవాణి ఇంట విషాదం..

-

సంగీత దర్శకుడు కీరవాణి ఇంట్లో విషాద ఛాయలు అలముకున్నాయి కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కీరవాణి తల్లి ఈరోజు మరణించారు..

వయో సంబంధిత రుగ్మతలతో బాధపడుతున్న కీరవాణి తల్లి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు కన్నుమూశారు దీంతో ఆయన ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.. గత కొన్నాళ్ల నుంచి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె కొన్ని రోజుల క్రితం కిమ్స్ ఆస్పత్రిలో చేరారు అయితే ఆమె శరీరం వయసు రీత్యా వైద్యానికి స్పందించకపోవడంతో తీవ్ర అస్వస్థతకు గురై ఈరోజు తుది శ్వాస విడిచారు.. తల్లి మరణంతో కీరవాణి తీవ్ర వేదనకు గురయ్యారు. ఆసుపత్రి నుండి మృతదేహాన్ని కీరవాణి ఇంటికి తరలించనున్నారు. కీరవాణి తల్లి మృతి వార్త తెలుసుకున్న చిత్ర ప్రముఖులు, సన్నిహితులు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.

దర్శకుడు రాజమౌళి కీరవాణికి సోదరుడు అవుతారు. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్, కీరవాణి తండ్రి శివ శక్తి దత్త అన్నదమ్ములు.. అలాగే శివశక్తి దత్త కూడా సినీ రంగంలో పనిచేసిన వారే.. తండ్రి సినీ వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్ అయ్యారు. టాలీవుడ్ లో సంగీత దర్శకుడిగా కీరవాణి సుదీర్ఘ కెరీర్ కలిగి ఉన్నారు. అలాగే రాజమౌళి అన్ని సినిమాలకు కీరవాణి సంగీతం అందిస్తారు అతను మొదటి చిత్రం నుండి ఇప్పటివరకు ప్రతి చిత్రానికి కీరవాణి అందించిన రాగాలు సినిమాను మరో స్థాయికి తీసుకువెళ్లాయి..

Read more RELATED
Recommended to you

Latest news