బాలయ్య సినిమాలో త్రిష.. డిమాండ్ చూసి బిత్తరపోయిన మేకర్స్ ..!

-

ప్రముఖ తమిళ్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన పొన్నియన్ సెల్వన్ సినిమాలో కుందవై పాత్ర పోషించి తన నటనతో పాత్రకు జీవం పోసింది. ఇక పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది త్రిష. ఇకపోతే నాలుగు పదుల వయసులో కూడా చెక్కుచెదరని అందంతో మంచి గుర్తింపును తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. పొన్నియన్ సెల్వన్ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ పెరగడంతో డిమాండ్ కూడా పెంచేసింది. వర్షం సినిమాతో భారీ గుర్తింపు సొంతం చేసుకున్న త్రిష ఇప్పుడు బాలయ్య సినిమాలో మరొకసారి నటించే అవకాశం వచ్చిందని సమాచారం.

నిజానికి త్రిష ఇండస్ట్రీకి వచ్చి 20 ఏళ్లకు పైగా పూర్తయింది. ఇక ఈ లాంగ్ కెరియర్ లో త్రిష ఎన్నో సినిమాలు చేసింది. ప్రస్తుతం ఈమె వయసు 40 సంవత్సరాలు చేరువలో ఉన్న నేపథ్యంలో కూడా వరుస ఆఫర్లు అందుకుంటూ బిజీ హీరోయిన్ గా మారిపోయింది త్రిష. 40 సంవత్సరాలకు చేరువలో ఉన్న త్రిష 30 సంవత్సరాల యువతి లెవెల్లో ప్రజెంట్ చేయగా.. ఆమె లుక్స్ చూసి అభిమానుల సైతం ఫిదా అయ్యారు. అందుకే ఆమెకు విపరీతంగా అభిమానులు కూడా పెరిగిపోతున్నారు. ఈ క్రమంలోనే నందమూరి బాలకృష్ణ హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న సినిమాలో హీరోయిన్ ఎవరన్న విషయం ఇంకా ఫైనల్ కాలేదు.

ఇక ఈ సినిమాలో పెళ్లి సందD బ్యూటీ శ్రీ లీల బాలకృష్ణ కు కూతురు పాత్రలో నటిస్తోంది. ఇక ఈ క్రమంలోనే త్రిషను హీరోయిన్ గా తీసుకుంటున్నారని వార్త బాగా వైరల్ అవుతుంది. ఇక ఆమెకు కథ నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. కానీ ఈ సినిమా కోసం త్రిష అడిగిన పారితోషకమే నిర్మాతలను బిత్తరపోయేలా చేస్తోంది. ఇకపోతే పొన్నియన్ సెల్వన్ సినిమాలో రూ. 2.5 కోట్లు తీసుకుందని సమాచారం. ఇక ఎప్పుడూ తెలుగులో రాబోతున్న ఈ సినిమా కోసం త్రిష కోటి రూపాయలు అడగడంతో నిర్మాతలు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. కానీ క్రేజ్ ఉన్న అమ్మాయిని హీరోయిన్గా పెట్టుకుంటే మంచి గుర్తింపు వస్తుందని ఆలోచనలో ఈమె డిమాండ్ కి కూడా ఓకే చెప్పారట నిర్మాతలు. ఇకపోతే దీనిపై అధికారిక ప్రకటన మాత్రమే వెలువడాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news