ఏపీలో మంత్రులు వీరే, ఫైనల్ చేసిన సిఎం జగన్…!

-

ఆంధ్రప్రదేశ్ లో మంత్రి వర్గ విస్తరణ అనగానే సిఎం జగన్ ఎవరికి ఇస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. ఎవరిని సిఎం తమ పదవులకు ఎంపిక చేస్తారా అని అందరూ ఎదురు చూస్తున్నారు. అయితే ఇద్దరి పేర్లను బీసీల నుంచి సిఎం జగన్ ఎంపిక చేసారు అనే వార్తలు వస్తున్నాయి. మత్స్య కార వర్గానికి చెందిన మోపిదేవి వెంకటరమణ ఇటీవల రాజ్యసభకు వెళ్ళగా తన నియోజకవర్గంలో కరోనాను సమర్ధవంతంగా ఎదుర్కొన్న అదే సామాజిక వర్గానికి చెందిన సిదిరి అప్పల రాజుని జగన్ ఎంపిక చేసారు.

అలాగే శెట్టి బలిజ వర్గానికి చెందిన పిల్లి సుభాష్ చంద్రబోస్ స్థానంలో సిఎం జగన్… అదే సామాజికవర్గానికి చెందిన రామచంద్రపురం ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ కు ఇవ్వనున్నట్టు తెలిసింది. త్వరలోనే వీరిని అధికారికంగా ప్రకటించి కేబినేట్ లోకి తీసుకునే అవకాశం ఉంది అని అంటున్నారు. సిదిరి అప్పల రాజు సిఎం జగన్ కు నమ్మకస్తుడిగా ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news