ఆ మ‌ర్డ‌ర్ ప్ర‌శాంత్ రెడ్డి చేయించాడు.. ఎంపీ అర‌వింద్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌

-

ఎంపీ అర‌వింద్ మంత్రి ప్ర‌శాంత్‌రెడ్డిపై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. నిజ‌మాబాద్‌లోని బాల్కొండ‌కు చెందిన సిద్ధార్థ రాష్ట్ర వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో పోలీసులు త‌ప్పుదోవ ప‌ట్టించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారంటూ మృతుడి బంధువులు పోలీసుల‌పై దాడి చేయ‌గా ఈ విష‌యం వెలుగులోకి వ‌చ్చింది.

అయితే మంగ‌ళ‌వారం సిద్ధార్థ కుటుంబీకుల‌ను పరామ‌ర్శించారు ధ‌ర్మ‌పురి అర‌వింద్‌. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మీడియాతో మాట్లాడారు. బీజేపీలో చురుగ్గా ఉంటున్నందుకే సిద్ధార్థ‌ను టీఆర్ ఎస్ నాయ‌కులు, మంత్రి ప్ర‌శాంత్ రెడ్డి హ‌త్య చేయించార‌ని ఆరోపించారు.

జిల్లాలో మంత్రి త‌మ్ముడు య‌థేచ్చ‌గా గంజాయి దందా చేస్తున్నాడ‌ని, అందుకు మంత్రి స‌పోర్టు చేస్తున్నాడ‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు అర‌వింద్‌. హ‌త్య చేసిన వ్య‌క్తికి జైల్లో పోలీసులు బిర్యానీ పెడుతున్నార‌ని, అత‌డు ఫేస్‌బుక్ స్టేట‌స్‌లు ఎలా పెడుతున్నాడంటూ మండిప‌డ్డారు. పోలీసుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు. ఈ హ‌త్య‌లో ఉన్న వారంద‌రినీ శిక్షించాల‌ని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news