ఐపీఎల్ లో ఆరెంజ్ ఆర్మీ కి గట్టి దెబ్బ..?

-

ఐపీఎల్లో టైటిల్ ఫేవరెట్ జట్టుగా సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. రెండేళ్లపాటు నిషేధానికి గురైన డేవిడ్ వార్నర్ మరోసారి సన్రైజర్స్ జట్టులో కి రావడమే కాదు జట్టు సారథ్య బాధ్యతలను కూడా చేపట్టడంతో… ఈసారి ఎట్టి పరిస్థితుల్లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు టైటిల్ గెలిచి తీరుతుంది అని అభిమానులు గట్టి నమ్మకంతో ఉన్నారు, కాగా ఇటీవలే బెంగుళూరు జట్టుతో మొదటి మ్యాచ్ ఆడిన సన్రైజర్స్ కి నిరాశే ఎదురైంది.

ఇక ఇప్పుడు ఐపీఎల్లో ఆరెంజ్ ఆర్మీ కి మరో గట్టి దెబ్బ తగిలిన తెలుస్తోంది. ఇటీవలే బెంగళూరులో జరిగిన మ్యాచ్ లో ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్ కి చీలమండ గాయం అయిన విషయం తెలిసిందే. అయినప్పటికీ చివరిలో మరోసారి బ్యాటింగ్ చేసేందుకు మైదానంలోకి వచ్చాడు మిచెల్ మార్ష్. ఈ గాయం పెద్దది కావడంతో తీవ్రంగా నొప్పితో బాధపడుతున్నానని దీంతో ఐపీఎల్ నుంచి మిచెల్ మార్ష్ తప్పుకున్నాడు అంటూ సన్రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం తెలిపింది. అతని స్థానంలో జాసన్ హోల్డర్ ను ఆడించినట్లు తెలిపింది సన్రైజర్స్ హైదరాబాద్.

Read more RELATED
Recommended to you

Latest news