తెలంగాణ ఉద్యమంలో అధికారుల పాత్ర ఎంతగానో ఉంది – సీఎం కేసీఆర్

-

నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జగిత్యాల జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా జగిత్యాలలో నూతనంగా నిర్మించిన టిఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించిన ఆయన అనంతరం.. జిల్లాలో నూతనంగా నిర్మించిన కలెక్టరేట్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో అధికారులు పాత్ర ఎంతగానో ఉందన్నారు. తాను చెప్పినట్లే దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఎక్కువ జీతాలు అధికారులకు ఇస్తున్నామన్నారు.

రాష్ట్రం ఏర్పడిన కొత్తలో 62 వేల లక్షల కోట్లు ఉన్న బడ్జెట్ ని, రెండు లక్షల కోట్లకు పెంచుకున్నామన్నారు.జిఎస్డిపి, తలసరి ఆదాయంలో దేశంలో మొదటి స్థానంలో నిలిచామని తెలిపారు సీఎం కేసీఆర్. భారతదేశంలోనే 24 గంటలు కరెంట్ ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ ఒక్కటేనన్నారు. గతంలో వ్యవసాయం నిరాదరణ అయి కూలీలు అయిన దినస్థితి ఉండేదన్నారు. తెలంగాణలో ప్రస్తుతం గ్రామీణాభివృద్ధి జరుగుతుందని అన్నారు. ప్రభుత్వం కు నష్టం వచ్చినా సాగుకు సాయం చేసి పంట కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు సీఎం కేసీఆర్.

Read more RELATED
Recommended to you

Latest news