రిలీజ్ కాకముందే సేఫ్ జోన్ లోకి వెళ్ళిన వారసుడు..!!

-

తెలుగులో మోస్ట్ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ గా పేరు పొందారు దిల్ రాజు. ఇటీవల కాలంలో మాత్రం కొన్ని వరుసగా అపజయాలు ఎదురయ్యాయి. చిన్న హీరోలతో సినిమాలు తీసినా.. అంతగా సక్సెస్ కాలేదని చెప్పవచ్చు. అలాగే కొత్త డైరెక్టర్లను కూడా ఆయన ఎక్కువగా అవకాశం ఇవ్వడం లేదు.. అయితే దిల్ రాజుతో సన్నిహితంగా ఉండే వంశీ పైడిపల్లి తో మాత్రం ఒక బిగ్గెస్ట్ సినిమాను తెరకెక్కించే పనిలో ఉన్నారు దిల్ రాజ్.

విజయ్ దళపతి హీరోగా నటిస్తున్న వారసుడు అనే సినిమాతో మొదటిసారిగా డైరెక్టుగా తెలుగులో హీరోగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రాన్ని ఒకేసారి తెలుగు, తమిళ్ భాషలలో విడుదల చేయబోతున్నారు. అయితే ఈ క్రమంలోని ఈ సినిమా కోసం విజయ్ దాదాపుగా రూ.100 కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకున్నట్లుగా తమిళ ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీంతో దిల్ రాజు ఎందుకు ఇంత రిస్క్ చేస్తున్నాడు అని కామెంట్లు కూడా ఎక్కువగా వినిపించాయి. కానీ దిల్ రాజు ఇలాంటివి ఏవి పట్టించుకోకుండా కేవలం ముందుకు వెళుతూ ఉన్నారు. ఇక బిజినెస్ వ్యవహారాలలో కూడా చాలా తెలివిగా వ్యవహరిస్తూ ఉంటారు దిల్ రాజు. మరొకసారి ఈ విషయం రుజువైందని చెప్పవచ్చు..

వారసుడు సినిమా నాన్ థియేట్రికల్ గా ఊహించని రేంజ్ లో బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. ఈ సినిమా శాటిలైట్ హక్కులను సన్ టీవీ రూ.50 కోట్లకు తీసుకున్నట్లు సమాచారం. అలాగే అమెజాన్ కూడా ఈ సినిమా ఓటీటీ హక్కులను రూ.60 కోట్లకు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక మ్యూజిక్ రైట్స్ టి సిరీస్ రూ.10 కోట్ల రూపాయలకు దక్కించుకున్నట్లుగా సమాచారం . ఈ రూట్లో మొత్తంగా నిర్మాత దిల్ రాజు రూ.120 కోట్ల రూపాయల వరకు దక్కించుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో దాదాపుగా బడ్జెట్లో సగం వరకు వెనక్కి వచ్చినట్లుగా తెలుస్తుంది. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు చిత్ర బృందం.

Read more RELATED
Recommended to you

Latest news