తల్లి మరణం తర్వాత బయటపడ్డ సంచలన నిజం.. కంటతడి పెట్టిస్తున్న పోస్ట్..

-

భూ ప్రపంచంలో తల్లి ప్రేమను మించింది మరొకటి లేదు.అమ్మ ప్రేమను కొలవడానికి కొలతలు లేవు.. కడుపులో పెట్టుకొని మోసి జన్మనిస్తుంది.. ఆ తర్వాత కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటుంది.. అందుకే అమ్మ ప్రేమ ముందు అన్నీ తక్కువే..తల్లి పేరు చెప్పగానే ఈ తనయుడైనా, కుమార్తే అయినా ఒకరమైన ప్రేమ, ఉద్వేగభరితమైన అనుభూతిని చెందుతారు.తల్లిని ప్రేమించని బిడ్డ ప్రపంచంలో ఉండడు. ఇక తల్లి లేని బాధ అత్యంత దారుణంగా ఉంటుంది. తాజాగా సోషల్ మీడియాలో ఓ వ్యక్తి చేసిన పోస్ట్ నెటిజన్లను కన్నీరు పెట్టిస్తోంది.. అది ఇప్పుడు వైరల్ అవుతుంది..

తల్లి మరణించిన తర్వాత తనతో గడిపిన క్షణాలను తలచుకొని, ఆమె జ్ఞాపకాన్ని తలుచుకుని తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. తన తల్లి మరణం తో తెలిసిన ఒక అద్భుతమైన నిజాన్ని గురించి సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ చేశాడు..విక్రమ్ అనే వ్యక్తి తన జ్ఞాపకాలను తలచుకుంటూ ట్విట్టర్‌లో భావోద్వేగభరితమైన పోస్ట్‌ను చేశారు. తన తల్లి వినియోగించిన 24 ఏళ్ల ప్లేట్ ఫోటోను కూడా షేర్ చేశాడు. ఈ ప్లేట్ తన తల్లికి చాలా ప్రత్యేకమైనదని చెప్పుకొచ్చాడు. అయితే, ఆ తల్లి ఆ ప్లేట్‌ను అంతగా ఇష్టపడటం వెనుక హృదయం చలించిపోయే కారణం ఉందని పేర్కొన్నాడు..

ఈ ప్లేట్‌లో తినడానికి తన తల్లి తనను, తన మేనకోడలిని మాత్రమే అనుమతించేదని విక్రమ్ చెప్పాడు. అయితే, తన తల్లి మరణించిన తర్వాత.. ఇప్పటి వరకు తెలియని ఈ ‘ప్లేట్‌’కి సంబంధించిన కథ గురించి విక్రమ్‌కు తెలిసింది.. విక్రమ్ ఏడోతరగతి లో ప్లేట్ బహుమతిగా గెలుచుకున్నాడు..ఈ విషయాన్ని విక్రమ్‌కి తన సోదరి చెప్పింది. అప్పటి నుంచి గత 24 సంవత్సరాలుగా తన తల్లి ఆ ప్లేట్‌లోనే భోజనం చేసేది. ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటూ ఎమోషనల్ అయ్యాడు విక్రమ్.తల్లి ప్రేమ ఎంత గొప్పదో కదా అంటూ విక్రమ్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.. ఇది చూసిన నెటిజన్లు కంటతడి పెడుతున్నారు..

Read more RELATED
Recommended to you

Latest news