ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ ఆసక్తికర వ్యాఖ్యలు

-

వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకి వ్యాపారాలు ఏమీ లేవని.. జర్మనీకి వెళ్లి 9 ఒప్పందాలు చేసుకొని వచ్చానన్నారు. నాలుగో సారి వేములవాడ నియోజకవర్గంలో బిఆర్ఎస్ జండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు చెన్నమనేని రమేష్. వచ్చే ఎన్నికలలో ప్రతి ఒక్కరూ సైనికుడిలా పనిచేయాలన్నారు.

బిజెపి, కాంగ్రెస్ పార్టీలు విఫలం అయ్యాయని.. అందుకే బిఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేశామన్నారు. బిజెపి, కాంగ్రెస్ పార్టీలు మునిగిపోయిన పడవలు అని ఎద్దేవా చేశారు. వేములవాడ దేవాలయ అభివృద్ధిపై కేటీఆర్ ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారని తెలిపారు. ఇక వచ్చే ఎన్నికలలో తన బామ్మర్ది వినోద్ కుమార్ ని కరీంనగర్ ఎంపీగా గెలిపిద్దాం అన్నారు చెన్నమనేని రమేష్.

Read more RELATED
Recommended to you

Latest news