చంద్రబాబు పగటి కలలు కంటున్నారు – మంత్రి జయరాం

-

టిడిపి అధినేత నారా చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు మంత్రి గుమ్మనూరు జయరాం. నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో స్కాంలు చేసిన నాయకుడు చంద్రబాబు నాయుడేనన్నారు. 2014 నుండి రాజధాని పేరుతో, మరోవైపు స్కిల్ డెవలప్మెంట్ లో 371 కోట్ల స్కాం చేశారని ఆరోపించారు. రెండు స్కాంలో 800 కోట్ల రూపాయలు దోచుకున్నారని ఆరోపించారు మంత్రి గుమ్మనూరు జయరాం.

రెండు ఎకరాల భూస్వామి ఎన్ని ఎకరాలు దోచుకొనున్నారో అర్థం అవుతుందన్నారు. ఆర్థిక అసమానతలను కాపాడిన ఘనత సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దేనన్నారు. ప్రజలకు మేలు చేస్తున్న ఏపీ ప్రభుత్వం పై బురద చల్లి ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. లోకేష్ పాదయాత్రలో‌ ప్రజలకు ఏం చేస్తారో చెప్పడం లేదన్నారు. అన్ని రంగాలలో సీఎం జగన్ అభివృద్ధి చేసి, మూడు పూటలా ప్రజలకు భోజనం అందిస్తున్నారని వివరించారు.

చంద్రబాబు నాయుడు పగటి కలలు కంటున్నారని.. ఏపి ప్రజలను దోచుకున్న వ్యక్తి చంద్రబాబు అంటూ విరుచుకుపడ్డారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును ఇంటికే పరిమితం చేస్తారని జోష్యం చెప్పారు మంత్రి గుమ్మనూరు. బడ్జెట్ సమావేశాల్లో వాల్మీకులను ఎస్టీలుగా గుర్తిస్తూ అసెంబ్లీలో తీర్మానంపై చేయడం సంతోషంగా వుందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news