మహారాష్ట్ర మంత్రి అనిల్ పరబ్ ఇంటిపై ఈడీ దాడులు

-

మహారాష్ట్రలో అధికార పక్షమే లక్ష్యంగా జాతీయ దర్యాప్తు సంస్థ దాడులు నిర్వహిస్తోంది. ఇప్పటికే ఉద్ధవ్ థాక్రే మంత్రివర్గంలోని ఓ మంత్రిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా రవాణా శాఖ మంత్రి, శివసేన నేత అనిల్ పరబ్ ఇంటిపై దాడులు నిర్వహించారు. ఈ రోజు తెల్లవారుజామున ముంబైలోని పరబ్ అధికార నివాసంతోపాటు ఆయన కుటుంబసభ్యుల ఇంట్లో సోదాలు నిర్వహించారు. మనీలాండరింగ్ నిరోధన చట్టంలోని పలు సెక్షన్ల ప్రకారం ఆయనపై పలు కేసులు నమోదు చేశారు.

శివసేన నేత అనిల్ పరబ్
శివసేన నేత అనిల్ పరబ్

మంత్రి అనిల్ పరబ్‌కు డపోలీ సిటీలో ఓ రిసార్ట్ ఉంది. దానిని ఆయన 2017లో రూ. కోటి వెచ్చించి కొనుగోలు చేశారు. ఆ తర్వాత 2019లో ఆ రిసార్ట్‌ ని సదానంద్ కదమ్ అనే వ్యక్తికి రూ.1.10 కోట్లకు అమ్మేశారు. 2020లో అక్కడ నిర్మాణాలు చేశారు. అయితే అప్పట్లోనే రిసార్టు వ్యవహారంలో రూ.6 కోట్లు అక్రమాలు జరిగినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news