గుడ్ న్యూస్ : తెలంగాణకు 320 కోట్లు విడుదల చేసిన వరల్డ్ బ్యాంక్

-

తెలంగాణ ప్రభుత్వానికి వరల్డ్ బ్యాంక్ శుభవార్త చెప్పింది. తెలంగాణ రాష్ట్రంలో రోడ్ సేఫ్టీ కి వరల్డ్ బ్యాంకు ఏకంగా 320 కోట్లు విడుదల చేసినట్లు సీఎస్ సోమేష్ కుమార్ పేర్కొన్నారు. హైదరాబాద్ బి ఆర్ కే భవన్ లో రోడ్లు, రవాణా, పోలీస్ శాఖల అధికారులతో పాటు వరల్డ్ బ్యాంక్ టీం తో శుక్రవారం సి ఎస్ సోమేష్ కుమార్ రివ్యూ నిర్వహించారు.

వెహికల్స్, రోడ్ నెట్వర్క్ పొడవు, రోడ్డు ప్రమాదం మరణాల ఆధారంగా దేశంలోని 14 రాష్ట్రాలకు ప్రపంచబ్యాంక్.. రూ. 6725 కోట్ల నిధులు కేటాయించిందని అందులో తెలంగాణ రాష్ట్రానికి 320 కోట్లు కేటాయించి న ట్లు తెలిపారు సిఎస్ సోమేష్ కుమార్ తెలిపారు. రోడ్ యాక్సిడెంట్ ల నివారణకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలను సి ఎస్.. వరల్డ్ బ్యాంకు ప్రతినిధులకు వివరించారు. ఈ మీటింగ్ లో బ్యాంక్ ప్రతినిధులు ఆర్నాబ్ బందోపాధ్యాయ, వెంకట్రావు, విజేత బెజ్జం, హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రవి గుప్త, అడిషనల్ డిజిపి జితేందర్, ఇతరులు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news