డబ్బు కోసమే ఇండస్ట్రీకి వచ్చా అంటున్న యంగ్ హీరోయిన్..!

-

సాధారణంగా చాలామంది నటనపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెడితే.. మరికొంతమంది తమ అవసరాలను తీర్చుకోవడానికి డబ్బే ప్రధాన లక్ష్యంగా ఇండస్ట్రీలోకి అడుగుపెడుతూ ఉంటారు. అలాంటి వారిలో ప్రియా భవాని శంకర్ కూడా ఒకరు. తాజాగా ఈమె డబ్బు సంపాదించడం కోసమే నటించడానికి వచ్చాను అని కుండబద్దలు కొట్టేసింది. బుల్లితెర నుంచి వెండితెరకు వచ్చిన ఈమె మేయాదమానే అనే చిత్రం ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే మంచి విజయం అందుకుంది.

ఆ తర్వాత ఎస్ జె సూర్య నటించిన మాన్స్టర్, కార్తీ నటించిన కడై కుట్టి సింగం, అరుణ్ విజయ్ నటించిన మాఫియా, ధనుష్ నటించిన తిరుచ్చిట్రంఫలం వంటి సినిమాలలో హీరోయిన్ గా నటించి మరింత గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం రుద్రం, డిమాంటి కాలనీ -2, ఇండియన్ -2 చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ.. ఇటీవల తెలుగు పరిశ్రమకు కూడా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా సంతోష్ శోభన్ నటించిన కళ్యాణం కమనీయం సినిమా.. సంక్రాంతి సందర్భంగా ఈనెల 14న ప్రేక్షకులను పలకరించడానికి తెరపైకి తమ సినిమాతో వచ్చి సందడి చేసింది.

ఇప్పుడు మరో తెలుగు చిత్రం లో కూడా చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సహజత్వంతో కూడిన కథ చిత్రాలంటే తనకు ఇష్టం అని.. ఇటీవల తమిళంలో ధనుష్ తిరుచ్చిట్రంఫలం చిత్రంలో నటించడం సంతోషంగా ఉందని తెలిపింది . ఇకపోతే నటించడానికి వచ్చినప్పుడు భవిష్యత్తు గురించి ఎలాంటి ఆలోచనలు లేవు అని.. ప్రేక్షకులు తనను ఆదరిస్తారా? లేదా? అనే భయం కూడా లేదు అని.. నటిస్తే డబ్బు వస్తుంది అని మాత్రమే భావించానని.. అందుకే నటించడానికి వచ్చాను అని తెలిసింది ప్రియా భవాని శంకర్. ఇకపోతే ప్రస్తుతం ప్రియా భవాని శంకర్ చేసిన ఈ కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news