వేలి ముద్రల దొంగతనం… అవును నిజం

-

ఈ మధ్య కాలంలో నేరాలు చేసే వ్యక్తులు కాస్త సాంకేతిక పరిజ్ఞానం ఎక్కువగా వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు ఎంత అప్రమత్తంగా ఉన్నా సరే నేరాలు మాత్రం ఆగడం లేదనే చెప్పాలి. తాజాగా ఒక కొత్త మోసం జరిగింది. పే పాయింట్ అకౌంట్ ద్వారా డబ్బులు కొట్టేసారు కొందరు కేటుగాళ్లు. ఆధార్ నెంబర్, వేలి ముద్రల ఫోటోతో కొత్త రకం మోసంకు పాల్పడ్డారు. ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రెవెన్యూ వెబ్ సైట్ నుంచి భూముల దస్తావేజులు డౌన్ లోడ్ చేసారు. దస్తావేజుల్లో ఉన్న ఆధార్ కార్డు, వేలి ముద్రల ఫోటోలతో బ్యాంకు అకౌంట్ నుంచి పే పాయింట్ అకౌంట్ ద్వారా నగదు డ్రా చేసారు. తనకు తెలియకుండా తన ఖాతాలో నుంచి రూ10000 కాజేశారని మధురా నగర్ కాలనీ కి చెందిన సిద్ధి రెడ్డి వీర వెంకట సత్యనారాయణ మూర్తి ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసిన ఎస్.ఆర్.నగర్ పోలీసులు నిందితులను గుర్తించి అరెస్ట్ చేసారు. నిందితులు విశాల్, అర్షద్ సీఏ విద్యార్థులుగా గుర్తించారు. కేవలం ఆధార్ కార్డు, వేలి ముద్రల ఫోటో.. నీటి చుక్కల సాయంతో పేపాయింట్ ద్వారా డబ్బు తస్కరించినట్టు నిందితులు మీడియాకు వెల్లడించారు. ఈ ఘటనతో పోలీసులు కూడా కంగుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news