వయసు ఐదు పదులు దాటినా పెళ్లి చేసుకోని హీరోయిన్స్..!

-

జనరల్ గా కల్యాణమొచ్చినా కక్కొచ్చినా ఆగదు అని పెద్దలు చెప్తుంటారు. యుక్త వయసు వచ్చిందంటే పెళ్లి ఆటోమేటిక్ గా జరుగుతుందని, పెద్దలు దగ్గరుండి మరీ పెళ్లిళ్లు చేస్తారని పేర్కొంటారు. ఒకవేళ పెళ్లి కుదరకపోతే పెద్దలే దగ్గరుండి మరీ సంబంధాలు చూసి ఎలాగోలాగా పెళ్లి సెట్ చేస్తారు. ఇక సెలబ్రిటీలకు అయితే పెళ్లి ఎప్పుడు? అన్న ప్రశ్న యుక్త వయసు వచ్చాక ఎదురవుతూనే ఉంటుంది.

మీడియాతో పాటు సోషల్ మీడియాలో సెలబ్రిటీలు ఎక్కడ కనబడినా..ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలని అడుగుతుంటారు. కరోనా కట్టడికి విధించిన లాక్ డౌన్ లో కొంత మంది ఫేమస్ సెలబ్రిటీలు ఓ ఇంటి వారు అయిపోయారు. కాగా, ఈ ప్రముఖ హీరోయిన్స్ మాత్రం ఇంకా బ్యాచిలర్స్ గానే ఉన్నారు. ఐదు పదుల వయసు వచ్చినప్పటికీ ఇంకా బ్యాచిలర్స్ గానే ఉన్నారు. ఆ 50 ఏళ్లు దాటిన హీరోయిన్స్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రముఖ హీరోయిన్ టబు..గతంలో టాలీవుడ్ స్టార్ హీరోలు చిరంజీవి, వెంకటేశ్, నాగార్జున సినిమాల్లో నటించింది. ఇటీవల ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’ పిక్చర్ లో కీ రోల్ ప్లే చేసింది. బాలీవుడ్ లో ప్రజెంట్ ఫుల్ బిజీ ఆర్టిస్ట్ గా ఉంది ఈ నటి. ఈమె అసలు పెళ్లి గురించి మర్చిపోయిందని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తుంటారు. ఇప్పటికీ పెళ్లికి దూరంగానే ఉంది నటి టబు.

మెగాస్టార్ చిరంజీవి సరసన హీరోయిన్ గా నటించిన ప్రముఖ నటి, డ్యాన్సర్ శోభన..మ్యారేజ్ కు దూరంగా ఉంది. ఐదు పదుల వయసు దాటిన ఈ నటి..డ్యాన్స్ టీచర్ గా విద్యార్థినులకు డ్యాన్స్ నేర్పుతోంది. సంప్రదాయ నృత్యాల్లో దిట్ట అయిన శోభన..కూచిపూడి నృత్యాన్ని ఇప్పటికే చాలా మందికి నేర్పింది.

బాలీవుడ్ హీరోయిన్ దివ్యా దత్త కూడా పెళ్లికి దూరంగానే ఉంది. సరైన జోడీ దొరకలేదని, అందుకే తాను పెళ్లికి దూరంగా ఉన్నానని దివ్యా దత్త అంటోంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘బద్రి’ పిక్చర్ లో హీరోయిన్ గా నటించిన అమీషా పటేల్ కూడా పెళ్లికి దూరంగానే ఉంది. ఐదు పదుల వయసు దగ్గరికి వస్తున్నప్పటికీ పెళ్లి ఊసే ఎత్తడం లేదు ఈ నటి. ప్రముఖ నటి నగ్మా కూడా పెళ్లికి దూరంగానే ఉండటం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Latest news