బిగ్ బాస్ సీజన్7లో సెలబ్రిటీ జంట వారే..!

-

ఈనెల 18వ తేదీన బిగ్ బాస్ తెలుగులో గ్రాండ్ గా పూర్తయిన విషయం తెలిసిందే. దీంతో ఇప్పటినుంచి బిగ్ బాస్ సీజన్ సెవెన్ గురించి చర్చలు ప్రారంభమయ్యాయి. ఎలాగో సీజన్ సెవెన్ కి హోస్ట్ గా నాగార్జున చేయణని చెప్పిన విషయం తెలిసిందే. దీంతో కొత్త హోస్ట్ కోసం వెతుకుతున్న నిర్వాహకులు పనిలో పనిగా కంటెస్టెంట్లను కూడా వెతుకుతున్నారు. ఈ క్రమంలోని ప్రతి సీజన్లో కూడా సెలబ్రిటీ జంట వచ్చి సందడి చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవల సీరియల్స్ , వెబ్ సిరీస్ ద్వారా బాగా పాపులారిటీ దక్కించుకొని.. వైవాహిక బంధం లోకి అడుగుపెట్టిన కొత్త జంట బిగ్ బాస్ సీజన్ సెవెన్ లోకి రాబోతోంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

జానకి కలగనలేదు సీరియల్ తో పాటు మిస్టర్ పెళ్ళాం వెబ్ సిరీస్ లో హీరో గా నటించిన అమర్ దీప్.. కేరాఫ్ అనసూయ సీరియల్ లో నటించిన తేజస్విని గౌడ ఆగస్టులో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. దాదాపు 5 నెలల విరామం తర్వాత డిసెంబర్ 14వ తేదీన వైవాహిక బంధం లోకి అడుగుపెట్టి కొత్త జీవితాన్ని ప్రారంభించారు. అంతేకాదు వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు కూడా నెట్టింట బాగా వైరల్ అవడంతో వీరిద్దరికి కూడా ప్రజల్లో బాగా ఐడెంటిఫై లభించింది. ఇలా ప్రేక్షకులలో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ జంటను బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో జోడీ గా తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది.

వీరితోపాటు ప్రముఖ సింగర్ మోహన భోగరాజు కూడా కంటెస్టెంట్ గా పాల్గొనపోతున్నారు. ప్రతి సీజన్లో కూడా ఒక సింగర్ వచ్చి మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే . ఇప్పటికే శ్రీరామచంద్ర , సింగర్ రేవంత్, రాహుల్ సిప్లిగంజ్ తదితరులు బిగ్ బాస్ కార్యక్రమాలలో పాల్గొన్నారు. రేవంత్ , రాహుల్ ఇద్దరు టైటిల్ విన్నర్లు కాగా శ్రీ రామచంద్ర మాత్రమే మధ్యలోనే ఎలిమినేట్ అయ్యాడు. ఇప్పుడు మోహన భోగరాజు సీజన్ 7 లో అడుగు పెట్టబోతోంది. మరి ఈమె టైటిల్ విన్నర్ అవుతుందా లేక మధ్యలో వెళ్ళిపోతుందా అనేది చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news