తెలివైన దొంగలు.. శానిటైజ్ చేసుకుని మరీ చోరీ.!

-

కరోనా తెచ్చిన తిప్పల కారణంగా శానిటైజర్, మాస్క్ ఇప్పుడు ప్రతి మనిషిలో భాగమైపోయింది. ఏ వస్తువు ముట్టుకోవాలన్నా ముందుగా వాటిని రాసుకున్న తర్వాతే చేతిలోకి తీసుకుంటున్నారు మనుషులంతా.. ఆఖరికి దొంగతనానికి వచ్చిన దొంగలు కూడా చేతులను శానిటైజ్ చేసుకుని మరీ చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటన రాజ‌స్థాన్‌లోని దౌల్‌పూర్లో చోటు చేసుకుంది.

స్థానికంగా ఉన్న రెండు దుకాణాల్లోకి వెనుకవైపు నుంచి చొరబడిన దొంగలు తొలుత అక్కడున్న ఆహార పదార్ధాలను లాగించారు. ఆ తరువాత తమ చేతి వాటం చూయించి అందినకాడికి దోచుకెళ్లారు. ఉదయం దుకాణం యజమానులు తలుపు తీసిన తరువాత చోరీ జరిగిందన్న విషయాన్ని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటన స్థలానికి చేరుకొని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. దొంగలు ముందుగా చేతులకు శానిటైజర్ రాసుకొని రూ. 5 వేల నగదుతో పాటు నిత్యావసరాలు ఎత్తుకెళ్లారని గుర్తించారు. దీంతో వారి కోసం గాలింపు మొదలుపెట్టారు. దాదాపు లక్ష రూపాయల సామాను మాయమైనట్టు అధికారులు తేల్చారు.

Read more RELATED
Recommended to you

Latest news