దువ్వాడ వాణి వ్యాఖ్యలపై శ్రీనివాస్ రియాక్షన్ ఇదే..!

-

ఆంధ్రప్రదేశ్ లో గత కొద్ది రోజుల నుంచి దువ్వాడ శ్రీనివాస్-వాణిల వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. పిల్లల కోసం కలిసి ఉండటానికి అయినా సిద్దమే అని దువ్వాడ వాణి పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా వాణి వ్యాఖ్యలపై స్పందించారు దువ్వాడ శ్రీనివాస్. వాణి రోజుకో రకంగా మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. టెక్కలి వదిలి వెళ్లాలని మాట్లాడారు. ఆస్తులపై మాట్లాడారు. తండ్రిగా నా బాధ్యతను నిర్వహిస్తా. ఓ వైపు పెద్ద మనుషులను పంపిస్తూ.. మరోవైపు కోర్టుకు పోయారని ఆవేదన వ్యక్తం చేశారు.

నా కూతుర్ల పేరు మీద దాదాపు రూ.27కోట్ల ఆస్తులు రాయడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ కొత్త ఇల్లు మాత్రం రాసివ్వడానికి సిద్దంగా లేను అని చెప్పారు. దయచేసి నన్ను డిస్టర్బ్ చేయవద్దు.. ఓ బంగ్లా ఇచ్చాను వాడుకోండి అని చెప్పారు దువ్వాడ శ్రీనివాస్. 16 నెలల్లో దాదాపు రూ.40లక్షలు ఇచ్చానని తెలిపారు. వాణి నాటకీయంగానే మాట మార్చారు. ఇంట్లోంచి తరిమి వేసిన తరువాత చచ్చానా.. బ్రతికానా అని చూడలేదు. అయినా తాను ఆస్తులు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాను అని తెలిపారు. రాజకీయంగా తనను పతనం చేయాలన్నదే వాణి ఉద్దేశం అని.. కోర్టుల్లోనే తేల్చుకుంటామని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news