ఈ క్యూ లైన్ సినిమా, రేషన్, మంచినీళ్ల కోసం కాదు!

-

నల్లొండ: సాధారణంగా కొత్త సినిమా టికెట్ల కోసం జనాలు భారీ సంఖ్యలో క్యూకడతారు. ఆ తర్వాత మందు (బ్రాందీ, విస్కీ) షాపుల దగ్గర కనబడారు. మహిళలైతే ఎక్కువగా మంచినీళ్ల కుళాయి, రేషన్ షాపుల వద్ద భారీగా కనిపిస్తారు. కానీ కరోనా పుణ్యమా అని జనాలు టెస్టింగ్, వ్యాక్సిన్ కేంద్రాల వద్ద భారీగా చేరుకుంటున్నారు. దీంతో భారీ క్యూ ఏర్పడుతోంది. అయితే ఎవరి దగ్గర కరోనా ఉంటుందో తెలియదు కనుక క్యూ లైన్లో మనుషులకు బదులు ఆధార్ కార్డుల జిరాక్స్‌లు, రాళ్లు, చెప్పులు పెడుతున్నారు. గంటల తరబడి వెయిట్ చేసి కరోనా టెస్టులు, వ్యాక్సిన్ చేయించుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు చాలానే జరుగుతున్నాయి.

తాజాగా పేపర్లు, చెప్పులు క్యూకట్టడం సూర్యాపేట గిరినగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద వెలుగులోకి వచ్చింది. కరోనా టెస్టులు, వ్యాక్సిన్ కోసం ప్రజలు బారులు తీరారు. కోవిడ్ భయంతో ఆధార్ కార్డుల జిరాక్స్ పేపర్లు, చెప్పులు, రాళ్లు క్యూలైన్‌లో ఉంచారు. అయితే ఇక్కడి నుంచి కరోనా వ్యాప్తి చెందుతోందని జనాలు అంటున్నారు. కరోనా నిబంధనలు అస్సలు పాటించడంలేదని చెబుతున్నారు. స్లాట్ బుక్ చేసుకున్నప్పటికీ వ్యాక్సిన్, టెస్టులు చాలా ఆలస్యమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టెస్టులు, వ్యాక్సిన్లు పరిమితంగా కాకుండా ఎక్కువ సంఖ్యలో చేయాలని పేర్కొంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news