మహేశ్ ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్..‘సర్కారు వారి పాట’లో ఆ సీన్స్ హైలైట్..

-

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబుకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు.. మరీ ముఖ్యంగా అమ్మాయిలు అయితే మహేశ్ అంటే పడి చచ్చిపోతుంటారు. మహేశ్ సినిమా విడుదల అయితే చాలు పండుగ చేసుకుంటారు. అటువంటిది కొవిడ్ మహమ్మారి వలన గత రెండేళ్లుగా మహేశ్ చిత్రం ప్రేక్షకుల వద్దకు రాలేదు. తెలుగు ప్రేక్షకులకు మహేశ్ చివరగా ‘సరిలేరు నీకెవ్వరు’ పిక్చర్ లో కనిపించారు. ప్రస్తుతం ఆయన ‘సర్కారు వారి పాట’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ ఈ ఏడాది మే 12న విడుదల కానుంది.

లవ్, యాక్షన్, కామెడీ ప్రధానంగా సాగే ఈ చిత్రానికి ‘గీతా గోవిందం’ ఫేమ్ డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన రెండు పాటలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ పిక్చర్ లో యాక్షన్ ఎపిసోడ్స్ చాలా బాగా వచ్చాయని తెలుస్తోంది. దుబాయ్, గోవా, స్పెయిన్ దేశాలలో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు.

ఇకపోతే ఈ చిత్రంలోని కీలక యాక్షన్ ఎపిసోడ్ ను కొద్ది రోజుల కిందట హైదరాబాద్ లో రైల్వేస్టేషన్ సెట్ వేసి చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ఆ ఎపిసోడ్ సీన్స్ సినిమాకు హైలైట్ గా నిలుస్తాయని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇందులో మహేశ్ సరసన ‘మహానటి’ కీర్తి సురేశ్ హీరోయిన్ గా నటించగా, ‘కళావతి, పెన్నీ’ పాటలకు సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది.

ఈ చిత్రంలో కామెడీ సీన్స్ హైలైట్ గా ఉంటాయట. వెన్నెల కిషోర్, మహేశ్..కామెడీ సీన్స్ లో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించేస్తారట. అంచనాలు ఎలా ఉన్నప్పటికీ సినిమా మాత్రం అంచనాలను మించి ఉంటుందని దర్శకుడు పరశురామ్ చెప్తున్నారు. ఈ చిత్రం తర్వాత మహేశ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ‘ఎస్ఎస్ఎంబీ 28’ ఫిల్మ్ చేయనున్నారు. ఆ తర్వాత టాలీవుడ్ జక్కన్న రాజమౌళితో ఓ చిత్రం చేయనున్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news