ఆ ఇద్దరిని భారీ మెజార్టీతో గెలిపించాలి: ప్రధాని నరేంద్ర మోడీ

-

కరీంనగర్, పెద్దపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థులు బండిసంజయ్, గోమాస శ్రీనివాసన్ను భారీ మోజార్టీతో గెలిపించాలని మోడీ పిలుపునిచ్చారు. జగిత్యాల విజయసంకల్ప సభలో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికల పండగ మొదలైందని అన్నారు. తెలంగాణ ప్రజలు సరికొత్త చరిత్రను లిఖించబోతున్నారని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో 400 సీట్లు దాటాలి- బీజేపీకి ఓటేయాలని మోడీ కోరారు. బీజేపీతోనే అభివృద్ధి సాధ్యమని ఈ సందర్భంగా ఆయన అన్నారు.

బీజేపీకి అధికారమిస్తే తెలంగాణ రాష్ట్రాన్ని మరింతగా అభివృద్ధి చేస్తామని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ‘రైతుల కోసం పసుపు బోర్డు తీసుకొచ్చాం అని పంట ధరను క్వింటాలు ₹6వేల నుంచి ₹30వేలకు పెంచాం అని గుర్తు చేశారు. ఇక్కడి ప్రభుత్వాలు షుగర్ ఫ్యాక్టరీని తెరిపించలేకపోయాయి అని ఆరోపించారు.మేము ₹6,400కోట్లతో రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని పునరుద్ధరించాం అని తెలిపారు. కేంద్రంలో మళ్లీ అధికారంలోకి రాగానే తెలంగాణ ప్రగతిపై దృష్టి సారిస్తాం’ అని ప్రధాని మోడీ హామీ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news