ప్ర‌భాస్ కొత్త సినిమా సెట్ కోసం.. అంత ఖ‌ర్చు పెట్టారా..?

-

టాలీవుడ్ యంగ్ రెబ‌ల్ స్టార్ ప్రభాస్ వరుసగా భారీ సినిమాలు చేసుకుంటూ వస్తున్నాడు. ‘బాహుబలి’ నుంచి ఆయన సినిమాలు వందల కోట్ల బడ్జెట్ తోనే రూపొందుతున్నాయి. ఇక ప్రస్తుతం ప్ర‌భాస్‌ జాన్‌ సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే. సాహో తరువాత జిల్‌ ఫేం రాధకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు ప్రభాస్‌. పీరియాడిక్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్, సాహో సెట్స్ మీద ఉండగానే ప్రారంభమైంది. అయితే సాహో రిలీజ్‌ తరువాత షూటింగ్‌ను తిరిగి ప్రారంభించేందుకు చాలా సమయం తీసుకున్నాడు ప్రభాస్‌. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. యూరప్ నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది.

కొంతకాలం క్రితం యూరప్ లో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. ఇప్పుడు అదే నేపథ్యంతో కూడిన సన్నివేశాలను చిత్రీకరించడానికి భారీ సెట్ వేశారు. అంటే .. కథ సెట్లో కాకుండా యూరప్ లో నడుస్తున్నట్టుగానే ఉంటుందన్న మాట. ఆ ఫీల్ ను తీసుకురావడానికి ఆ స్థాయిలో వేసిన కారణంగానే ఈ సెట్ కోసం 3 కోట్ల వరకూ ఖర్చు అయిందట. ప్రత్యేకమైన ఈ సెట్లో షూటింగ్ పూర్తయిన తరువాత, తదుపరి షెడ్యూల్ కోసం ఆస్ట్రియా వెళ్లనున్నారు. కాగా, ప్రభాస్‌ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్‌ సంస్థతో కలిసి ప్రభాస్ పెదనాన కృష్ణంరాజు గోపీకృష్ణ మూవీస్‌ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news