ఒంగోలు హాస్పిటల్ నుండి ముగ్గురు కరోనా పేషెంట్స్ పరార్

-

ఒంగోలు జీజీహెచ్ నుంచి ముగ్గురు కరోనా రోగుల పరారవడం కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే వార్డు నంబర్ 215 నుంచి చీమకుర్తి పట్టణానికి చెందిన ఏ శ్రీనివాసరావు, అలానే వార్డ్ నెంబర్ 216 నుంచి రాచర్ల మండలం అక్కిరెడ్డిపల్లెకి చెందిన ఎల్‌ నారాయణరెడ్డి, ఎల్‌ రామలక్షణ రెడ్డి సిబ్బందికి చెప్పకుండా వెళ్ళిపోయినట్టు వైద్యాధికారులు కాస్త లేటుగా గుర్తించారు. గత కొద్దిరోజులుగా జీజీహెచ్ ను సమస్యలు చుట్టుముట్టాయి.

నాలుగు రోజుల క్రితం జీజీహెచ్ లో మృతి చెందిన కరోనా రోగి మృతదేహాన్ని ఎవరూ పట్టించుకోక పోవడంతో అక్కడి కుక్కలు పీక్కుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అంతే కాకా జీజీహెచ్ లో కరోనా రోగులకు పెడుతున్న ఆహారం, సౌకర్యాలపై పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేశారు రోగులు. ఈ సమస్యల వల్లే ఈ ముగ్గురూ ఆస్పత్రి నుండి చెప్పా పెట్టకుండా వెళ్లిపోయి ఉంటారని భావిస్తున్నారు. కరోనా పేషెంట్స్ ఇచ్చిన అడ్రెస్, ఫోన్ నెంబర్ లతో వారిని ట్రేస్ చేసే పనిలో పడ్డారు అధికారులు.

Read more RELATED
Recommended to you

Latest news