విషాదం.. ఇల్లు కూలి ముగ్గురు దుర్మరణం

-

నేడు సూర్యాపేట జిల్లాలో ఒక ఘోరమైన ఘటన చోటు చేసుకుంది. పాత గోడలు ఉన్న ఒక ఇల్లు కూలి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారుతమ ప్రాణాలు కోల్పయారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు కమ్ముకున్నాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగారం మండల కేంద్రానికి చెందిన తల్లిదండ్రులు కుమారుడు.. షీలా శ్రీను, రాములు, రామక్కలు స్థానికంగా మట్టి గోడలతో నిర్మించిన ఇంట్లో ఏళ్ల నుండి ఉంటున్నారు.

All about the legal rights of the dead

ఇటీవల కురిసిన వర్షాలకు మట్టి గోడల్లోకి నీరు వచ్చాయి. దీంతో అవి మెత్తబడ్డాయి. కుటుంబసభ్యులు ఇంట్లో ఉన్న సమయంలో ఒక్క సారిగా ఇల్లు మొత్తం కుప్ప కూలింది. మట్టి పెళ్లలు ముగ్గురిపై పడటంతో వారంతా అక్కడికక్కడే మృతి చెందారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టినా లాభం లేకుండా పోయింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news