ప్రభుత్వంపై మేము యుద్ధమే చేస్తున్నాం – తుమ్మల హాట్ కామెంట్స్

-

సీతారామ ప్రాజెక్టు వద్ద తుమ్మల‌ కామెంట్స్ చేశారు. తెలంగాణ రాష్ట్రానికి కావాల్సిన అన్ని అనుమతులు ఇవ్వాలని ఒక రకంగా కేంద్ర ప్రభుత్వం పై యుద్దమే చేస్తున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం పై వత్తిడి తీసుకువచ్చి విభజన అంశాలు యే ఉన్నాయో వాటిలో ప్రధానంగా నదీజాలాల సమస్యను ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రస్తావించారన్నారు.

సీతారామ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో వినియోగంలో రావటం కోసం నిర్మాణం చేసిన సీతమ్మసాగర్ బ్యారేజ్ వరకు ఈ సీజన్ లోనే కంప్లీట్ చేయ్యాలని కేసిఆర్ అధికారులకు ఆదేశించారు.ఇక్కడ 36TMC నీళ్ళు నిల్వ ఉండటం వలన మంచినీటికి గాను సాగునీటికి గాను ఎలాంటి ఇబ్బంది ఉండకుండా చూడటం కోసమే సీతమ్మ సాగర్ ప్రాజెక్టు అన్నారు తుమ్మల. సీతమ్మ సాగర్ ప్రాజెక్టు సజావుగా పూర్తి చెయ్యాటానికి ముఖ్యమంత్రి సూచనలు మేరకు అధికారులు కష్టపడి పని చేస్తున్నారు.అందరు కలిసి అనుకున్న సమయానికి ప్రాజెక్టు పూర్తి చేయ్యాలని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news