టీటీడీ ఛైర్మన్ పదవికి తిరుపతి ఎమ్మెల్యే భూమన రాజీనామా

-

వైసీపీ ఘోర ఓటమితో టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు.టీటీడీ చైర్మన్ పదవికి మంగళవారం సాయంత్రం భూమన కరుణాకర రెడ్డి రాజీనామా చేశారు.గత ఆగస్టు నెల్లో టీటీడీ చైర్మన్ గా భూమన కరుణాకర రెడ్డి బాధ్యతలు చేపట్టారు.తన రాజీనామాను ఆమోదించమంటూ టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి కి భూమన కరుణాకర రెడ్డి లేఖ రాశారు. కాగా, 2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం వహించి గెలుపొందారు. ప్రస్తుతం తిరుపతి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన కుమారుడు భూమన అభినయ్ ఓటమి దిశగా సాగుతున్నారు.

కాగా, తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఛైర్మన్ గా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ ని గత ఆగస్టు నెలలో నియమిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news