గన్నవరం వదిలి వెళ్లిన వల్లభనేని వంశీ..!

-

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వైసీపీ నేతలను ఉక్కిరిబిక్కిరి చేశాయి. సింగిల్ డిజిట్ కే పరిమితమవుతున్న నేపథ్యంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈక్రమంలో వైసీపీ నాయకుడు, ఎమ్మెల్యే అభ్యర్థి వల్లభనేని వంశీ గన్నవరంలో ఘోర ఓటమిని చవిచూశారు. టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకటరావు 33 వేలకుపైగా ఓట్ల తేడాతో విజయం సాధించారు.

దీంతో వంశీ తన సొంత నియోజకవర్గం గన్నవరం వీడారు. కుటుంబంతో కలిసి హైదరాబాద్ బయల్దేరినట్లు సమాచారం. ఇప్పటివరకు వైసీపీ కేవలం 10 స్థానాలను మాత్రమే దక్కించుకుంది.
ప్రస్తుతం ఎన్డీయే కూటమి 165 స్థానాల్లో విజయం సాధించింది. ఇందులో టీడీపీ 136 స్థానాలు, జనసేన 21, బీజేపీ 08 స్థానాలను కైవసం చేసుకుంది.   మరోవైపు జగన్ కూడా కాస్త ఎమోషనల్ స్పీచ్ ఇచ్చారు. ఫలితాలు చూస్తే ఆశ్చర్యం కలిగిందని చెప్పారు. నూతనంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోయే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కి కంగ్రాట్స్ చెప్పారు.

 

Read more RELATED
Recommended to you

Latest news