తెలంగాణ జనసమితి 12 స్థానాల్లో పోటీ?

-

మహాకూటమిలో భాగస్వామ్య పక్షంగా ఉన్న తెలంగాణ జనసమితి ఊహించని విధంగా 12 స్థానాల్లో తమ అభ్యర్థులు పోటీ చేస్తారని ప్రకటించింది. పార్టీ అధ్యక్షుడు కోదండరాం సూచన మేరకు పోటీ స్థానాలను తాను వెళ్లడిస్తున్నట్లు తెజస నేత విశ్వేశ్వర్‌రావు తెలిపారు. ఎప్పటి నుంచో వారు కోరుకున్న స్థానాలు ఇవ్వకుండా మహాకూటమి తీవ్ర జాప్యం చేస్తుందని ఆయన పేర్కొన్నారు.

ఈ సందర్భంగా  తెజస కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. దుబ్బాక, మెదక్‌, మల్కాజ్‌గిరి, అంబర్‌పేట్‌, సిద్దిపేట, వరంగల్‌ తూర్పు, వర్థన్నపేట, ఆసిఫాబాద్‌, స్టేషన్‌ఘన్‌పూర్‌, జనగామ, మహబూబ్‌నగర్‌, మిర్యాలగూడలో పోటీ చేయనున్నట్లు తెలిపారు. ఈ 12 స్థానాలు మాత్రం అధికారికంగా తమకు కేటాయించాయని పేర్కొన్నారు. తెజస వైఖరితో కూటిమి కోటకు బీటలు వారుతున్నాయని సర్వత్ర చర్చ కొనసాగుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news