కరోనా తో ఎమ్మెల్యే మృతి.. సీఎం ట్వీట్..!

-

కరోనాతో తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే తమోనాష్ ఘోష్ కన్నుమూశారు. గత నెలలో ఆయనకు కరోనా సోకగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం చనిపోయినట్లు తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ట్వీట్ చేశారు. చాలా చాలా విషాద‌క‌ర‌మైన విష‌య‌మ‌ని, ఫాల్తా నియోజ‌క‌వ‌ర్గం నుంచి త‌మోనాష్ మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన‌ట్లు మ‌మ‌తా బెన‌ర్జీ ట్వీట్ చేశారు.

1998 నుంచి తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ ట్రెజ‌ర‌ర్‌ గా ప‌నిచేస్తున్నార‌ని, త‌మ‌ది 35 ఏళ్ల అనుబంధం అని, ప్ర‌జ‌లు, పార్టీ కోసం ఆయ‌న శ్ర‌మించార‌ని, స‌మాజ సేవ‌కు ఆయ‌న త‌న జీవితాన్ని అంకితం చేశార‌ని మ‌మ‌తా బెన‌ర్జీ తెలిపారు. త‌మోనాష్ మృతి ప‌ట్ల భార్య జార్నా , కుటుంబ‌స‌భ్యులు, బంధుమిత్రుల‌కు సంతాపం ప్ర‌క‌టిస్తున్న‌ట్లు మమతా ట్వీట్ చేశారు. ఇటీవ‌ల త‌మిళ‌నాడుకు చెందిన డీఎంకే ఎమ్మెల్యే అన‌బ‌ళ‌గ‌న్ కూడా క‌రోనా వైర‌స్ వ‌ల్ల ప్రాణాలు కోల్పోయిన విష‌యం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news