అధికారంలోకి వస్తే మహిళలకు రూ.5000.. గోవాలో టీఎంసీ ఎన్నికల హామీ

-

వచ్చే ఏడాది ఫిబ్రవరిలో గోవా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. తొలిసారి పోటీ చేస్తున్న తృణమూల్ కాంగ్రెస్‌ ఓటర్లకు హామీల జల్లు కురిపిస్తున్నది. వచ్చే ఎన్నికల్లో టీఎంసీకి ఓటు వేసి గెలిపిస్తే మహిళలకు ప్రతి నెలా రూ.5,000 ఇస్తామని ప్రకటించింది. ఆ పథకానికి గృహలక్ష్మి అని పేరు పెట్టారు. టీఎంసీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆదాయ మద్దతులో భాగంగా ప్రతి ఇంటిలోని మహిళకు రూ.5,000 బదిలీ చేయనున్నట్లు తెలిపారు.

గోవాలో అధికారంలోకి రాగానే గృహలక్షి పథకానికి సంబంధించిన కార్డ్‌లను జారీ చేస్తామని, ఆ కార్డ్స్‌కు యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్ ఉంటుందని, దాని ద్వారా మహిళల ఖాతాలో డబ్బులు జమ అవుతాయని తెలిపింది. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవడం లేదని, 40 సీట్లకు పోటీ చేస్తున్నట్లు టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news