నేడే ప్రొటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం..

-

తెలంగాణలో మధ్యంతర ఎన్నికల్లో విజయం సాధించిన తెరాస ప్రభుత్వం ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారానికి ముహుర్తం ఖరారు చేసింది. ఇందులో భాగంగా..బుధవారం ప్రొటెం స్పీకర్గా ఎంఐఎం నేత, చార్మినార్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సీఎం కేసీఆర్ సూచన మేరకు నేటి సాయంత్రం రాజ్‌భవన్‌లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు.  ప్రొటెం స్పీకర్ 119 మంది ఎమ్మెల్యేలతో (నామినేటెడ్ సభ్యుడితో కలిపి) ప్రమాణ స్వీకారం చేయిస్తారు. తొలుత సీఎం కేసీఆర్ ప్రమాణం, ఆ వెంటనే మహిళా సభ్యులు, ఇలా నూతనంగా ఎన్నికైన అందరు సభ్యుల ప్రమాణ స్వీకారం నిర్వహిస్తారు.

ఈ కార్యక్రమం అనంతరం… గురువారం రోజు స్పీకర్‌ ఎన్నికకు నోటిఫికేషన్‌ జారీ చేస్తారు. 18న అసెంబ్లీ స్పీకర్‌ ఎన్నిక ఉంటుంది. 19న శాసనసభ, శాసనమండలి సభ్యులను ఉద్దేశించి గవర్నర్‌ నరసింహన్‌ ప్రసంగిస్తారు. రేపటి నుంచి 20 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news