నాని కన్ను ఆమెపై పడ్డదా..!

-

నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం గౌతం తిన్ననూరి డైరక్షన్ లో జెర్సీ సినిమా చేస్తున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ ఈ సినిమా నిర్మిస్తున్నారు. శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ నుండి వచ్చిన టీజర్ ఈమధ్యనే రిలీజై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.

ఇక ఈ సినిమా తర్వాత నాని విక్రం కుమార్ డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఈ మూవీలో హీరోయిన్ గా మేఘా ఆకాష్ నటిస్తుందని తెలుస్తుంది. కోలీవుడ్ హీరోయిన్ అయిన మేఘా ఆకాష్ తెలుగులో లై, ఛల్ మోహన్ రంగ సినిమాలు చేసింది. ఆ రెండు సినిమాలు అమ్మడికి హిట్ ఇవ్వలేదు.

ఈ సినిమాలో ఐదుగురు హీరోయిన్స్ ఉంటారని తెలుస్తుండగా మేఘా ఆకాశ్ మాత్రం మెయిన్ హీరోయిన్ అంటున్నారు. జెర్సీ రిలీజ్ తర్వాత ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.

Read more RELATED
Recommended to you

Latest news