నేటితో బిజెపి యువ సంఘర్షణ యాత్ర ముగింపు

-

ఆంధ్రప్రదేశ్ బిజెపి చేపట్టిన యువ సంఘర్షణ యాత్ర నేటితో ముగియనుంది. తిరుపతి నుంచి కర్నూలు వరకు ఈ యాత్ర కొనసాగింది. ఆగస్టు 2వ తేదీన తిరుపతి నుంచి ప్రారంభమైన ఈ యాత్ర నేడు విజయవాడలోని ముగియనుంది. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం, ఎన్నికల సమయంలో జగన్ ఏం చెప్పారు.. ఇప్పుడు ఏం చేస్తున్నారనే అంశాలను ఈ సంఘర్షణ యాత్ర ద్వారా ప్రజలకు వివరించామని బీజేపీ నేతలు అంటున్నారు.

నేడు విజయవాడలోని వారధి నుంచి ఈ యువ సంఘర్షణ యాత్ర ప్రారంభమై.. భవానిపురం, చిట్టినగర్, సత్యనారాయణపురం, ఆర్టీసీ రోడ్, లెనిన్ సెంటర్ మీదుగా ధర్నా చౌక్ వరకు బిజెపి యువ సంఘర్షణ యాత్ర కొనసాగుతోంది. చివరగా ధర్నా చౌక్ వద్ద ముగింపు సభను ఏర్పాటు చేశారు. ఈ ముగింపు సభకు ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్షులు సోమ వీర్రాజు, రాజ్యసభ సభ్యులు సృజనా చౌదరి, సీఎం రమేష్ హాజరుకానున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news