ప్రముఖ టాలీవుడ్ సింగర్ కారుణ్య ఇంట్లో విషాదం..!

-

టాలీవుడ్ ప్రముఖ సినీ గాయకుడు కారుణ్య ఇంట తీవ్ర విషాదం నెలకొంది. గత కొంత కాలంగా కేన్సర్‌తో బాధపడుతున్న కారుణ్య తల్లి జానకి(70) శనివారం తెల్లవారుజామున కన్నుమూశారు. బాలాపూర్‌ మండలం మీర్‌పేట్‌లోని త్రివేణినగర్‌లో ఉన్న ఇంట్లోనే తుది శ్వాస విడిచారు. ఆమె మరణవార్త తెలుసుకున్న పలువురు ప్రముఖులు తమ విచారం వ్యక్తం చేశారు. కారుణ్య తల్లి కేంద్ర రక్షణ రంగ సంస్థ బీడీఎల్‌లో ఉద్యోగం చేసి పదవీ విరమణ పొందారు.

దీంతో కరోనా తీవ్రత దృష్ట్యా అతి తక్కువ మంది బంధువులు, సన్నిహితుల నడుమ సైదాబాద్‌ శ్మశానవాటికలో ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. ఇకపోతే హైదరాబాద్ నుంచి ఉత్తరాదికి వెళ్లి ఇండియన్ ఐడల్ సీజన్ -2 ద్వారా కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్న కారుణ్య . ఇప్పుడు ఎంతో మందికి అభిమాన గాయకుడిగా మారిపోయారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version