క‌రోనా రిక‌వ‌రీ కేసుల్లో టాప్-15 రాష్ట్రాలు ఇవే..!

-

భారత్ లో క‌రోనా మహమ్మారి త‌న ప్ర‌తాపం చూపుతూనే ఉన్న‌ది. ప్ర‌తిరోజు దాదాపు 20 వేల కొత్త కేసులు న‌మోద‌వుతున్నాయి. దీంతో దేశంలో న‌మోదైన మొత్తం క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఇప్ప‌టికే ఆరు ల‌క్ష‌ల మార్కును దాటింది. అయితే ఒక‌వైపు కొత్త కేసుల సంఖ్య పెరుగుతూ ఉండ‌గానే మ‌రోవైపు క‌‌రోనా బారి నుంచి రిక‌వ‌రీ అవుతున్న వారి సంఖ్య కూడా అంత‌కు మించే పెరుగుతున్న‌ది.

ఈ నేపధ్యంలో క‌రోనా వైర‌స్ నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య ఆధారంగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఒక జాబితాను రూపొందించింది. రికవరీ రేటు ఎక్కువగా ఉన్న టాప్‌-15 రాష్ట్రాల జాబితాను వెల్ల‌డించింది. ఈ జాబితాలో మ‌హారాష్ట్ర మొద‌టి స్థానంలో ఉండ‌గా, తెలంగాణ ప‌దో స్థానంలో ఉన్న‌ది. మొత్తం 93,154 మంది రిక‌వ‌రీ అయిన వారితో మ‌హారాష్ట్ర టాప్ ప్లేస్‌లో నిలువగా.. 5,353 మంది రిక‌వ‌రీ అయిన క‌రోనా బాధితుల‌తో ఒడిశా 15 స్థానంలో నిలిచింది.

Read more RELATED
Recommended to you

Latest news