సిఎస్ సోమేష్ కుమార్ కు ట్రాఫిక్ పోలీసుల షాక్..!

-

తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్ సోమేశ్ కుమార్ కు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు షాక్ ఇచ్చారు. సిఎస్ సోమేష్ కుమార్ కు ట్రాఫిక్ పోలీసులు రూ. 3000 చలానా విధించారు. సిఎస్ సోమేష్ కుమార్ వాహనం పీవీ నర్సింహారావు ఎక్స్ప్రెస్ హైవే పై అతివేగంగా వెళ్లినందుకు గానూ ఆయన వాహనానికి (TS09FA0001) పోలీసులు ఫైన్ వేసారు. ఓవర్ స్పీడ్ కారణంగానే పోలీసులు ఫైన్ విధించారు.

అంతే కాకుండా కాకుండా ఫైన్ విషయం తెలిసిన వెంటనే అధికారులు జరిమానా చెల్లించినట్టు ట్రాఫిక్ పోలీసులు పేర్కొన్నారు. ఇక ట్రాఫిక్ పోలీసులు చేసిన పనికి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. సాధారణ వ్యక్తులతో పాటు ట్రాఫిక్ నిబంధనలు పాటించని సెలబ్రిటీలకు, రాజకీయ నాయకులకు, అధికారులకు సైతం ట్రాఫిక్ పోలీసులు గతం లో కూడా ఇదే విధంగా ఫైన్ లు విధించారు.

Read more RELATED
Recommended to you

Latest news