యువతి ప్రాణం తీసిన ట్రయాంగిల్ లవ్ స్టోరీ …!

-

చదువుకొనే సమయంలో ఒకరిని ప్రేమించింది. ఉద్యోగంలో చేరిన చోట మరో వ్యక్తితో ప్రేమాయణం నడిపించింది. ముగ్గురి మధ్య ఏం జరిగిందనేది ఎవరికీ తెలియదు. ఐతే…యువతి ఆత్మహత్య చేసుకోవటం ఇప్పుడు కలకలం రేపింది. ట్రయాంగిల్ ప్రేమ కథ ఆఖరికి కాకినాడలో విషాదం రేపింది. ఇద్దరు యువకులను ప్రేమించిన ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

పశ్చిమ గోదావరి జిల్లా తాళ్ళపూడి మండలం వేగేశ్వరపురంకు చెందిన కాళ్ళ మహా వెంకట లక్ష్మీ ప్రసన్న నర్సింగ్ చదువుకుంది. చదువుకునే సమయంలో కాలేజీలోనే చక్రవర్తి అనే యువకుడిని ప్రేమించింది. అతడితో ప్రేమ కొనసాగుతుండగానే ఇటీవల కాకినాడలోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో ఉద్యోగంలో చేరింది. ఇక్కడే హెచ్.ఆర్. డిపార్ట్‌మెంట్‌లో పని చేసే రుద్రకుమార్ అనే యువకుడిని ప్రేమించింది. రుద్రకుమార్, లక్ష్మీ ప్రసన్న ఒక ఇంట్లోనే కలిసి ఉంటున్నారు. రాత్రి రుద్రకుమార్ బయటకు వెళ్ళి వచ్చేసరికి లక్ష్మీ ప్రసన్న ఆత్మహత్య చేసుకుంది. మృతురాలు కాల్ డేటా ఆధారంగా కేసు విచారణ జరుపుతున్నారు. లక్ష్మీ ప్రసన్న అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మొత్తానికి..ముగ్గురి మధ్య ఏం జరిగిందో తెలియదు. కానీ..తెల్లారేసరికల్లా లక్ష్మీ ప్రసన్న ఆత్మహత్య చేసుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news