వైఎస్‌ తెలంగాణ రాక్షసుడు.. జగన్ ది ద్రోహ హస్తం : టీఆర్ఎస్‌ ఎమ్మెల్యే సంచలనం

-

నాగర్ కర్నూల్ టిఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, సిఎం జగన్ పై నిప్పులు చెరిగారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తెలంగాణ ప్రాంతానికి రాక్షసుడు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్ర ప్రజలతో అడుకో… పులులు, సింహాలతో ఆడాలని అనుకోకు అని సిఎం జగన్ కు వార్నింగ్ ఇచ్చారు. కేసీఆర్ స్నేహ హస్తం ఇస్తే… జగన్ ద్రోహ హస్తం ఇస్తున్నాడని మండిపడ్డారు. ఏపీ సర్కార్ కడుతున్న ప్రాజెక్టులు అన్ని ఆపేయాలని డిమాండ్ చేశారు మర్రి జనార్దన్ రెడ్డి. ఎపియే కావాలని కయ్యం పెట్టుకుంటోందని ఆరోపణలు చేశారు.

వడ్లు పండించడంలో ఖమ్మం జిల్లాతో పాలమూరు జిల్లా పోటీ పడుతుందని తెలిపారు. టిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నారని స్పష్టం చేశారు మర్రి జనార్దన్ రెడ్డి. తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి  ఆంధ్ర నాయకులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వివాదం అయిన విషయం తెలిసిందే. ఆయన చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే వైసీపీ తరఫున ఎమ్మెల్యే రోజా ఫైర్ అయ్యారు. దీంతో ఈ వివాదం మరింత ముదిరింది. తాజాగా టిఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి వైఎస్ రాజశేఖర్ రెడ్డిని టార్గెట్ చేసి ఫైర్ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news