ఈట‌ల వ్య‌వ‌హారంలో సైలెంట్ గా ఉంటున్న ధ‌ర్మ‌పురి అర‌వింద్.. కార‌ణ‌మేంటి?

-

ధ‌ర్మ‌పురి అర‌వింద్ అంటే బీజేపీలో మాస్ ఫాలోయింగ్ ఉన్న లీడ‌ర్‌. రాష్ట్ర వ్యాప్తంగా ఆయ‌న‌కు డేరింగ్ అండ్ డ్యాషింగ్ లీడ‌ర్‌గా గుర్తింపు ఉంది. ఎక్క‌డ ఎల‌క్ష‌న్ వ‌చ్చినా ఆయ‌న త‌న ప్ర‌సంగంతో దూకుడుతో కార్య‌క‌ర్త‌లో ఉత్సాహం నింపుతారు. అలాంటి వ్య‌క్తి ఇప్పుడు త‌మ పార్టీకి కీల‌క‌మైన హుజూరాబాద్ ఉప ఎన్నిక‌ల్లో మాత్రం పెద్ద‌గా స్పందించ‌ట్లేదు.

 

ధ‌ర్మ‌పురి అర‌వింద్

ఈట‌ల రాజేంద‌ర్ వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి ఆయ‌న సైలెంట్‌గానే ఉంటున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న హుజూరాబాద్ ఉప ఎన్నిక‌ల‌పై ఎలాంటి కామెంట్లు కూడా చేయ‌లేదు. హుజూరాబాద్‌లో ఇన్‌చార్జుల‌ను నియ‌మిస్తూ రోడ్ షోలు, ప్ర‌చారాల‌తో బండి సంజ‌య్ దూసుకుపోతుంటే… అర‌వింద్ మాత్రం ఈట‌ల వ్య‌వ‌హారానికి దూరంగా ఉంటున్నారు.

ఇప్ప‌టికే బండి సంజ‌య్‌, ర‌ఘునంద‌న్‌రావు లాంటి కీల‌క నేత‌లు హుజూరాబాద్‌కు వ‌చ్చి ప్ర‌చారం చేసినా.. ధ‌ర్మ‌పురి అర‌వింద్ మాత్రం రాలేదు. ఆయ‌న మార్కు చూపించుకోవ‌డానికి ఇది క‌రెక్టు టైమ్ అయినా ఆయ‌న మాత్రం రంగంలోకి దిగ‌ట్లేదు. మ‌రి ఇప్పుడు ఆయ‌నను జ‌మ్మికుంట మండ‌లానికి ఇన్ చార్జిగా నియ‌మించారు బండి సంజ‌య్‌. మ‌రి ఈ బాధ్య‌త‌ల్లో ఆయ‌న ఎప్పుడు పాల్గొంటారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news