ఎన్నికలేవైనా కేసీఆర్ వెంటే ప్రజలు : ఎమ్మెల్సీ కవిత

-

ఎన్నికలేవైనా.. ఎక్కడ జరిగినా తెలంగాణ ప్రజలు ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటే ఉన్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఇది మరోసారి రుజువైందని చెప్పారు. టీఆర్ఎస్, బీఆర్ఎస్​లను విమర్శించే వారికి మునుగోడు ప్రజల తీర్పు చెంపపెట్టు లాంటిదని వ్యాఖ్యానించారు. కేసీఆర్ వెంట నడిచిన మునుగోడు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.

కార్తిక సోమవారం సందర్భంగా కవిత.. నిజామాబాద్​లోని నీలకంఠేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించారు. నీలకంఠుడికి ప్రత్యేక పూజలు చేశారు. ప్రజల కోరిక మేరకు నీలకంఠేశ్వర స్వామి ఆలయానికి రథం ఏర్పాటు పనులు జరుగుతున్నాయని కవిత తెలిపారు. దేవాదాయ శాఖ సహకారంతో రూ.50 లక్షల విలువ గల పనులు వేగంగా సాగుతున్నాయని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news