కేసీఆర్‌ను చూసి మోడీ బుద్ధి తెచ్చుకోవాలంట‌.. ఒక్క సారి బ‌య‌ట‌కు వ‌స్తేనే ఇంత చేయాలా?

-

సీఎం కేసీఆర్ అంటే ఇంత‌కు ముందు ఓ పేరుండేది. ఆయ‌న ఉంటే ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో లేదంటే ఫామ్ హౌస్ లోనే ఉంటారు అని. గ‌త ఆరేళ్లుగా ఇదే పేరు వినిపిస్తోంది. రాష్ట్రంలో ఎంత పెద్ద ప్రమాదం జ‌రిగినా.. ఎంత పెద్ద విధ్వంసం క‌లిగినా ఆయ‌న ఆ ప్రాంతానికి వెళ్లింది లేదు, ప‌రామ‌ర్శించింది లేదు. కానీ మొన్న మొద‌టిసారి గాంధీ ఆస్ప‌త్రికి, ఎంజీఎం ఆస్ప‌త్రికి వెళ్లారు.

 

అంతే ఇక టీఆర్ ఎస్ కార్య‌క‌ర్తలు, నేత‌లు, ఎమ్మెల్యేలు తెగ ప్ర‌చారం చేస్తున్నారు. సీఎంను చూసి అంతా బుద్ధి తెచ్చుకోవాలంటూ సోష‌ల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అస‌లు మొన్న‌టి వ‌ర‌కు ఎవ‌రికీ క‌నిపించ‌ని వ్య‌క్తి ఒక్క‌సారి బ‌య‌ట‌కు వ‌స్తేనే ఇంత చేయాలా అంటూ అంతా నోరెళ్ల‌బెడుతున్నారు.

ఇప్పుడు మంత్రిఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు ఇంకో అడుగు ముందుకేసి సీఎం కేసీఆర్ చూసి ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ బుద్ధి తెచ్చుకోవాలంటూ చెబుతున్నారు. కేసీఆర్ లాగా పీపీఈ కిట్లు లేకుండానే దేశ‌మంతా ప‌ర్య‌టించాల‌ని డిమాండ్ చేస్తున్నారు. అస‌లు కేసీఆర్ రాక రాక బ‌య‌ట‌కు వ‌స్తే అదో పెద్ద వింత‌లాగా చేస్తున్నారంటూ ఇప్ప‌టికే బీజేపీ నేత‌లు విమ‌ర్శ‌లు చేస్తున్నారు. మ‌రి ఇప్పుడు ఇలాంటి కామెంట్లు చేసి మంత్రి న‌వ్వుల పాల‌వడం అవ‌స‌ర‌మా అంటూ అంతా కామెంట్లు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version