టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు తీవ్ర అస్వస్థత !

-

హైదరాబాద్ లోని ముషీరాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ కు తీవ్ర అస్వస్థత చోటు చేసుకున్నట్టు చెబుతున్నారు. దీంతో ఆయన అత్యవసర చికిత్స కోసం సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రిలో చేరారు. ఇక ఆయనకు గత మూడు రోజులుగా స్వల్పంగా జ్వరం వస్తూ పోతూ ఉందని అంటున్నారు. అది ఎంత మాత్రం తగ్గక పోవడంతో ఆయన హాస్పిటల్ లో చేరాలని నిర్ణయించుకున్నారు.

ఇక యశోద ఆసుపత్రిలో చేరిన ముఠా గోపాల్ కు వైద్య పరీక్షలు చేశాక ఆయనకు ఊపిరితిత్తుల్లో స్వల్పంగా ఇన్ఫెక్షన్ ఉందని తేలింది. దీంతో వైద్యుల సలహా మేరకు ఎమ్మెల్యే ముఠా గోపాల్ సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యే ఆరోగ్యం నిలకడగా ఉందని అంటున్నారు. ఇక ఈయన మొన్న ఎన్నికల్లో ముషీరాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈ సీటు తన అల్లుడికి ఇప్పించుకోవాలని దివంగత నేత నాయిని నరసింహా రెడ్డి చాల ప్రయత్నించారు. కానీ కేసీఆర్ మాత్రం ముఠా గోపాల్ కే టికెట్ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news