టిఆర్ఎస్ విజయ గర్జన సభకోసం రంగంలోకి కీలక నేతలు…!

-

హన్మకొండ జిల్లా వ‌రంగ‌ల్‌లో టిఆర్ఎస్ పార్టీ విజ‌య‌గ‌ర్జ‌న స‌భ‌ స్థ‌లము కోసం మాడికొండ.. రాంపూర్.. ఉనికిచర్ల ఏరియాల్లో మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి, ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్ నాయకులు స్థలాన్ని పరిశీలించారు. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భ‌వించి రెండు దశాబ్ధాలు పూర్తి చేసుకుంటున్న‌ సందర్భంగా నవంబర్ 15న వరంగల్ లో విజయ గర్జన సభ నిర్వ‌హించెందుకు పార్టీ అధిష్టానం నిర్ణయించింది.

వరంగల్ న‌గ‌ర స‌మీపంలో సుమారు 10లక్షల మందితో భారీ ఎత్తున నిర్వహించే స‌భ‌ను విజ‌య‌వంతం చేసేందుకు జిల్లా నేతలు శ్రీ‌కారం చుట్టారు. అందులో భాగంగా న‌గ‌రంలోని మడికొండ, ఉనికిచర్ల, రాంపూర్ శివార్ల‌లోని ఖాళీ స్థ‌లాల‌ను రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్ కుమార్, మాజీ డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి, మాజీ స్పీకర్ మధుసూదనాచారి తదితరులు ప‌రిశీలించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version