టెస్టులు తగ్గించి కేసులు తగ్గాయంటారా?.. టీ ప్రభుత్వానికి హైకోర్టు చురకలు

-

హైదరాబాద్: తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. ఈ విచారణకు డీజీపీ మహేందర్ రెడ్డి, పబ్లిక్ హెల్త్ ఆఫీసర్ శ్రీనివాస్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వం వినిపించిన వాదనలపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. పలు ప్రశ్నలు సంధించింది. రాష్ట్రంలో టెస్టులు సంఖ్య తగ్గించి, కేసులు తగ్గాయని ఎలా చెపుతారని హైకోర్టు ప్రశ్నించారు. టెస్టులు ఎందుకు పెంచడం లేదని మండిపడింది. రాష్ట్రంలో కావాల్సిన టెస్టులు చేస్తున్నామని హెల్త్ అఫీసర్ శ్రీనివాస్ రావు కోర్టుకు తెలిపారు. ఒక్క రోజు కూడా లక్ష టెస్టులు దాటలేదన్న హైకోర్టు.. నైట్ కర్ఫ్యూ పెట్టి ప్రభుత్వం చేతులు దులుపుకుందని వ్యాఖ్యానించింది. నైట్ కర్ఫ్యూ పెట్టినా కేసులు ఎందుకు పెరుగుతున్నాయని, లాక్ డౌన్ దిశ‌గా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ధర్మాసనం ప్రశ్నించింది. ప్రభుత్వ హాస్పిటల్స్‌లో బెడ్స్, ఆక్సిజన్ డేటా సమర్పించాలని ఆదేశించింది. తెలంగాణలో ఆక్సిజన్ ఎంత డిమాండ్ ఉందన్న హైకోర్టు ప్రశ్నకు 600 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను డిమాండ్ ఉందని శ్రీనివాస్ రావు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం 430 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే పలు కర్ణాటక, ఒరిస్సా నుండి ఆక్సిజన్ తెచ్చామని, తమిళనాడు నుంచి రావాల్సిన 55 మెట్రిక్ టన్స్ ఆక్సిజన్ రాలేదని కోర్టుకు శ్రీనివాస్ రావు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news