TSRTC : వీకెండ్ లో హైదరాబాద్ టూర్.. 12 గంటల ప్యాకేజీ..!

-

చాలా మంది హైదరాబాద్ ని ఇష్టపడుతూ వుంటారు. మీరు కూడా హైదరాబాద్ ని చూడాలని అనుకుంటున్నారా..? అయితే 12 గంటల్లో హైదరాబాద్‌లోని పర్యాటక ప్రాంతాలు చూసేయచ్చు. తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (TSRTC) హైదరాబాద్ దర్శన్ అనే ఓ ప్యాకేజీను తీసుకు వచ్చింది.

ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే… ఒక రోజులో హైదరాబాద్‌లోని ప్రదేశాలను చూడచ్చు. ఆన్‌లైన్‌లో లేదా ఆఫ్‌లైన్‌ లో అయినా టికెట్స్ ని బుక్ చెయ్యచ్చు. దర్శన్ టూర్ ఉదయాన్నే స్టార్ట్ అవుతుంది. ఉదయం 8 గంటలకు సికింద్రాబాద్‌లోని ఆల్ఫా హోటల్ లో ఇది స్టార్ట్ అవుతుంది.

తరవాత ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు బిర్లా మందిర్ చూడచ్చు.
10.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు చౌమహల్లా ప్యాలెస్
తారామతి బారాదరి రిసార్ట్‌లో హరిత హోటల్‌లో మధ్యాహ్నం 1 గంట నుంచి 1.45 గంటల వరకు లంచ్ ఉంటుంది.
మధ్యాహ్నం 2 గంటల నుంచి 3.30 గంటల వరకు గోల్కొండ కోట చూడచ్చు.
4 గంటల నుంచి 5 గంటల వరకు దుర్గం చెరువు పార్క్, 5.30 గంటల నుంచి 6 గంటల వరకు కేబుల్ బ్రిడ్జి, 6.30 గంటల నుంచి 7.30 గంటల వరకు ఎన్‌టీఆర్ పార్క్, హుస్సేన్ సాగర్ ని చూసేయచ్చు.
రాత్రి 8 గంటలకు సికింద్రాబాద్‌ ఆల్పా హోటల్‌కు రీచ్ అవుతారు.
www.tsrtconline.in వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు.
మెట్రో ఎక్స్‌ప్రెస్‌లో ఈ టూర్ వేయాలంటే పెద్దలకు రూ.250, పిల్లలకు రూ.130 చెల్లించాలి. అదే మెట్రో లగ్జరీ ఏసీ బస్సులో అయితే పెద్దలకు రూ.450, పిల్లలకు రూ.340 చెల్లించాలి. 040 23450033 లేదా 040 69440000 నెంబర్లకు సంప్రదించచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news