టీటీడీ ఈవో ధ‌ర్మారెడ్డి కుమారుడికి గుండెపోటు..!

-

టీటీడీ ఈవో ధర్మారెడ్డికి మరో షాక్‌ తగిలింది. తాజాగా టీటీడీ ఈవో ధర్మారెడ్డి కుమారుడు చంద్రమౌళి గుండెపోటుకు గురయ్యారు. ఆయనను హుటాహుటిన చెన్నైలోని కావేరి ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతున్నారు. చంద్రమౌళికి ఇటీవలే టీటీడీ చెన్నై స్థానిక సలహా మండలి అధ్యక్షుడు ఏజే శేఖర్ రెడ్డి కుమార్తెతో నిశ్చితార్థం జరిగింది.

జనవరిలో వీరి వివాహం తిరుమలలో జరగాల్సి ఉంది. చంద్రమౌళి ముంబై లో ఉద్యోగం చేస్తున్నారని, సివిల్స్ కు ప్రిపేర్ అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో రెండు కుటుంబాల వారు పెళ్లికి శుభలేఖలు పంచుతున్నారు. చెన్నై అల్వారుపేటలోని బంధువులకు ఆహ్వాన పత్రిక ఇవ్వడానికి చంద్రమౌళి ఆదివారం మధ్యాహ్నం కారులో వెళ్లారు. అయితే కొద్దిసేపటికే గుండె నొప్పిగా ఉందని చెప్పడంతో పక్కనే ఉన్న స్నేహితుడు వెంటనే సమీపంలోని కావేరి ఆసుపత్రిలో చేర్పించారు. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news