శ్రీవారి భక్తులకు షాక్..తిరుమలలో వసతి గదుల అద్దె పెంపు

-

తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ షాక్. తిరుమలలో ఇటీవల తెరిచిన అద్దె గదుల ధరలు భారీగా పెరిగాయి. సంధకం, పాంచ జన్యo, కౌస్తుభం మరియు వకుళా మాత వంటి అద్దె గదుల ధరలను భారీగా పెంచారు.

 

500 రూపాయలు, 600 రూపాయలు ఉన్న ఈ గదుల ధరలను ఏకంగా వెయ్యి రూపాయలకు పెంచారు. నారాయణగిరి రెస్ట్ హౌస్ లో అద్దెను 700 రూపాయల నుంచి 1700 రూపాయలకు అమాంతం పెంచేశారు. కార్నర్ షూట్ ను 2200 రూపాయలకు, స్పెషల్ టైపు కాటేజీలలో 750 రూపాయలు ఉన్న గది అద్దె ను రూ.2800 చేశారు. అటు 50 రూపాయలు, వంద రూపాయల అద్దెతో లభించే అద్దె గదుల్లోనూ వసతులు కల్పించి.. అద్దెను పెంచేందుకు టీటీడీ పాలకమండలి సన్నద్ధమైనట్లు సమాచారం అందుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news