నేడు తిరుమల శ్రీవారి వర్చువల్‌ సేవా టికెట్లు విడుదల

-

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి భక్తులకు శుభవార్త. ఏడుకొండల స్వామి సేవలో తరలించాలనుకే భక్తులకు టీటీడీ గుడ్​న్యూస్ చెప్పింది. ఇవాళ వర్చువల్ సేవా టికెట్లను విడుదల చేయనుంది. ఈ విషయాన్ని టీటీడీ అధికారులు ప్రకటించారు.

మార్చి నెల కోటాకు సంబంధించిన ఈ టికెట్లను శుక్రవారం సాయంత్రం 4 గంటలకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచుతుంది. ఇందులోభాగంగా కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకర సేవా టికెట్లు, సంబంధిత దర్శన టికెట్లను విడుదల చేస్తుంది.

మార్చి నెలకుగాను రూ.300 టికెట్ల ఆన్‌లైన్‌ కోటాను ఇవాళ విడుదల చేయనుంది. ఈరోజు ఉదయం 10 గంటలకు టీటీడీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనుంది. ఇక ఏప్రిల్‌, మే నెలలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్లను మధ్యాహ్నం 2 గంటలకు విడుదల చేస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news