ఫిబ్రవరి మాసం కోసం రేపు తిరుమల శ్రీవారి రూ.300 ప్రత్యేక టికెట్లు విడుదల

-

తిరుమల శ్రీవారి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను టీటీడీ రేపు (నవంబరు 24) విడుదల చేయనుంది. ఫిబ్రవరి కోటాకు సంబంధించిన ఈ టికెట్లను రేపు 10 గంటలకు ఆన్ లైన్ లో అందుబాటులోకి తీసుకురానున్నారు. ఫిబ్రవరి కోటాకు సంబంధించి వసతి గదుల కోటా టికెట్లను కూడా రేపు విడుదల చేయనున్నారు. తిరుమల, తిరుపతిలోని వసతి గదుల టికెట్లను రేపు మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నారు. టికెట్ల బుకింగ్ కోసం https://ttdevasthanams.ap.gov.in వెబ్ సైట్ ను సందర్శించాలని టీటీడీ పేర్కొంది. తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి పంచమీతీర్థం సందర్భంగా శనివారం వాహనాలకు ట్రాఫిక్‌ ఆంక్షలు.. మళ్లింపులు చేశారు.

TTD to release Special Darshan tokens for February 22-28 tomorrow

శనివారం ఉదయం అమ్మవారి చక్రస్నానం పూర్తయ్యే వరకు తిరుచానూరు లోపలకి, బయటకు వాహనాలను పంపరు. తిరుపతి నుంచి వచ్చే భక్తులు నాలుగు చక్రాల వాహనాలను మార్కెట్‌ యార్డు, తనపల్లి క్రాస్‌ వద్ద పార్కింగ్‌ చేయాలి.. బైక్‌లు శిల్పారామం, వార్త క్రాస్‌ వద్ద పార్కింగ్‌ చేసి నవజీవన్‌ హాస్పిటల్‌ వద్ద ఉన్న హోల్డింగ్‌ పాయింట్‌ ద్వారా వెళ్లాలి. రేణిగుంట, గాజులమండ్యం నుంచి వచ్చే భక్తులు వార్త క్రాస్‌ వద్ద పార్కింగ్‌ చేయాలి. తమిళనాడు నుంచి వచ్చే భక్తులు పాడిపేట వద్ద వాహనాలు పార్కింగ్‌ చేసి.. గోశాల పాయింట్‌ నుంచి పుష్కరిణిలోకి రావాలి. చిత్తూరు నుంచి వచ్చే భక్తులు తనపల్లి క్రాస్‌ వద్ద పార్కింగ్‌ చేసి కాలినడకన నవజీవన్‌ వద్దకు వచ్చి క్యూలో ప్రవేశించాలి. పూడి మార్గం నుంచి వచ్చేవారు ముండ్లపూడి మీదుగా తనపల్లికి రావాలి. తిరుపతి రూరల్‌ ప్రజల తాజ్‌ హోటల్‌ మార్గం ద్వారా తిరుపతి వైపు రావాల్సి ఉంటుంది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news